తూప్రాన్ రెసిడెనిన్షియల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

Spread the love

విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి

సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

సాక్షిత మెదక్ ప్రతినిధి:

మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.స్కూల్ లో ఉన్న సమస్యల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు.పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూం గదులు ఒకే రూంలో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు.ఆర్డీఓ జయ చందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిను ద్దిన్,తహశిల్దార్ విజయలక్ష్మి ని పిలిపించి స్కూల్ సమస్యల పై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.స్కూల్ లో వాటర్ ప్లాంట్ మరమత్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50 వేల రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు.స్కూల్ లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.విద్యార్థులు కొంత మంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరా తీశారు.వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబు తో మెదక్ కలెక్టర్ రాజర్షి షా తో ఫోన్ లో మాట్లాడారు.స్కూల్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్ లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీవో కు ఆదేశించారు.రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్ లో ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్ మరియు పాఠశాల ఆవరణ సానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్ ను ఆదేశించారు.స్కూలు కి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహా శీల్దార్ ని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు.స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించా రు.10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు.అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బంది తో పాటు వాచ్ మెన్ లను సన్మానించి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
అదనపు తరగతులు,హాస్టల్ కి కుక్కలు రావడం,బెడ్స్ డర్మిటరీ లేకపోవడం ,డ్రింకింగ్ వాటర్ సమస్య ,కౌంపౌడ్ కూలిపోయిన సమస్యలు ఉన్నాయి. కొంత మంది పెద్దల సహకారం సి ఎస్ ఆర్ ఫండ్స్ ఆర్డిఓ,ఎం ఆర్ ఓ ల ద్వారా కొంత సమస్యలు పరిష్కరించా మని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కలెక్టర్ ని విజిట్ చేయాలని తెలిపామని అన్నారు.స్కూల్ లో మార్పులు జరగాలి.పాఠశాల భవిష్యత్ రూపు రేఖలు మార్చాలని ఆకస్మికంగా విజిట్ చేసానన్నారు. అందరు సహకరించాలని ఆదర్శ మోటార్స్ వారితో లైబ్రరీ కట్టించేలా మాట్లాడమన్నా రు.వేణు కార్వ వారితో బెడ్స్ డర్మిటరీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాఠశాల వసతి సౌకర్యాలకు మిగతా వారు కూడా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డివో జయ చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్,తహశిల్దార్ విజయలక్ష్మి ,ఎంపీడీఓ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page