డిసెంబర్ 3 తర్వాత గుడ్ న్యూస్.! నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్..

Spread the love

ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు తెలిపారు. అశోక్ నగర్ తో పాటు పలు యూనివర్సిటీలలో ఉత్సవ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు కేటీఆర్ ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి కేటీఆర్ తో విస్తృతంగా సంభాషించారు.

రాష్ట్ర యువకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం ఈ అంశం పైన చేస్తున్న అసత్య పూరిత ప్రాపగాండాను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు. మంత్రి కేటీఆర్ తమతో ఈ అంశం పైన విస్తృతంగా సంభాషించడం తమకు సంతోషాన్ని కలిగించిందని మంత్రితో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో కొంత ఆందోళన నెలకొందని వారు తెలిపారు.విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలను పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఒకవైపు తాము కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పట్ల సంతృప్తిగానే ఉన్నా మరిన్ని ఉద్యోగాలు పెంచాలన్న విద్యార్థుల సూచన మేరకు గ్రూప్-2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని తెలిపారు.

దీంతోపాటు కచ్చితంగా అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. దేశంలో తెలంగాణ కన్న ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను గత పది సంవత్సరాల లో భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా పది సంవత్సరాలలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యువకులకు గణాంకాలతో సహా వివరించాలని సవాలు చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యల పైన కూలంకషంగా చర్చించేందుకు ఉదయం 10 గంటలకి అశోక్ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగార్డులతో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదని..

ముఖ్యంగా సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదన్నారు. తాము రాష్ట్ర యువకులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు తెలిపారు. అశోక్ నగర్ తో పాటు పలు యూనివర్సిటీలలో ఉత్సవ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు కేటీఆర్ ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి కేటీఆర్ తో విస్తృతంగా సంభాషించారు.

Whatsapp Image 2023 11 21 At 8.40.12 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page