SAKSHITHA NEWS

ఇటీవల మృతి చెందిన మెట్రో టీవీ వీడియో జర్నలిస్ట్ బోనుల చిన్న కుటుంబాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సాయంత్రం పరామర్శించారు. ముందుగా చిన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులార్పించారు అనంతరం చిన్న భార్య ప్రియా, కుమారుడు హర్షిత్ రామ్, చిన్న తల్లి లక్ష్మమ్మ తో మాట్లాడారు
ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు చిన్న కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి మంత్రికి వివరించారు
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పని చేసే తత్త్వం కలిగిన చిన్న, చిన్న వయస్సులో దూరం కావడం విచారకరమన్నారు. చిన్న కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ అవసరం వున్నా తనను కలవ వచ్చునని పేర్కొన్నారు అనంతరం చిన్న భార్య కు 50వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

మంత్రి వెంట 47 వార్డు కార్పొరేటర్ కంటి పాము కామేశ్వరి, వైసిపీ నేత ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి, గురూజీ, కోరుబిల్లి విజయ్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS