SAKSHITHA NEWS

Members of the new committee of pastors fellowship who honored MLA…

ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ సభ్యులు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ కు చెందిన పాస్టర్స్ ఫెలోషిప్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె.స్మిత్ బాబు, వైస్ ప్రెసిడెంట్ మార్క్, జనరల్ సెక్రటరీ సత్యానందం, జాయింట్ సెక్రెటరీ పాల్, ట్రెజరర్ జాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డేవిడ్ పాల్, చార్లెస్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS