నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలకతీతంగా గెలిపించుకుని తీరుతామని ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు తెలిపారు.

Spread the love

పటాన్ చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఎంఆర్‌ యువసేనలో పెద్ద ఎత్తున చేరడంతో వారికి కండువా వేసి యువసేనలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి నీలం మధు ముదిరాజ్‌ వెంటే ఉంటామని వారు ఏకగ్రీవతీర్మానం చేశారు.

ఈ ఎన్నికల్లో బీసీ సబ్బండ వర్గాలకు చెందిన నీలం మధు ముదిరాజ్ ను బలపరిచి మాకు ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీకి కచ్చితంగా పంపుతామని తెలిపారు. దీనికి నియోజకవర్గం అంతా సిద్ధంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ నీలం మధు ముదిరాజ్‌కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ఎన్‌ఎంఆర్‌యువసేన కార్యకర్తలు, బీసీ వర్గాలు అందరూ కూడా ఇదే రీతిలో మద్దతు తెలుపుతున్నరన్నారు. ఒక్కసారి ఆశ్వీరదిస్తామని చెబుతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో మన్నే గంగయ్య, రుక్మయ్య,పి విగ్నేష్, బాల్ రాజ్, లక్ష్మి నారాయణ,రాములు, జీ మల్లేష్,లక్ష్మణ్,సతీష్,లక్ష్మణ్,నిరంజన్,భాస్కర్,బలరం,ముత్యాలు,గణేష్, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page