శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ

Spread the love

Masjid Banda in Serilingampally Division

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లోని ప్రభుపాద లే ఔట్ కాలనీ లో జరుగుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని,
వరద నీటి కాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని,పనులలో వేగం పెంచాలని , నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా వరద నీటి కాల్వ నిర్మాణం పై పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది. ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE సునీల్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పద్మారావు,కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి,రమణయ్య,మల్లేష్ యాదవ్,నగేష్ గౌడ్, పవన్, ప్రసాద్,సుదర్శన్, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page