తెలంగాణ బరోసా బహిరంగ సభను విజయవంతం చేయండి – గ్యార శేఖర్

Spread the love

తెలంగాణ బరోసా బహిరంగ సభను విజయవంతం చేయండి – గ్యార శేఖర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

మే 7న హైదరాబాద్,సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే “తెలంగాణ బరోసా సభను” విజయవంతం చేయాలని బీఎస్పీ చిట్యాల మండలం ఉపాధ్యక్షులు గ్యార శేఖరు కోరారు. ఆదివారం చిట్యాల మండల కేంద్రంలో మహనీయుల చౌరస్తా దగ్గర బహిరంగ సభ గోడ పత్రికను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ కొందరి చేతుల్లో బందీ అయిన తెలంగాణ ను,దోపిడీ దొరల నుండి విముక్తి చేయడానికి బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు బరోసా ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల మున్సిపాలిటీ అధ్యక్షులు ఔరండి ప్రశాంత్, నాయకులు
గాదే ఎల్లేష్, జిట్ట నరసింహా రాజ్, వంగాల మధు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page