పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి

Spread the love

సాక్షిత : షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడి
పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన షేక్. అక్బర్ జానీ భాషా ను మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఘనంగా సత్కరించారు. కారంపూడిలో జరిగిన అసరా చెక్కుల పంపిణి కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి నూతన చైర్మన్ ను ఘనంగా సత్కరించి పల్నాడు ప్రాంతంలో మైనారిటీల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనీ ఈ సందర్బంగా ఎమ్మెల్యే నూతన చైర్మన్ ను కోరారు అలాగే పల్నాడు ప్రాంతంలోని పల్నాడు జిల్లాలో వక్ఫ్ భూముల పరిరక్షణకు కృషిచేయాలనీ అయన కోరారు. పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రతిఒక్క ముస్లిం మైనారిటీకి సహాయం అందించి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి కృషిచేయాలనీ ఈ సందర్బంగా ఎమ్మెల్యే నూతన చైర్మన్ ను కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page