కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం

Spread the love

కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం పూర్తవడంతో ఆ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

“గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు జగనన్న ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం.. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు ప్రాధాన్యమిచ్చి.. ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

“గడపగడపకు – మన ప్రభుత్వం” కార్యక్రమం తో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు.. అభివృద్ధి జరుగుతుంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ప్రజలు అడిగిన రోడ్లు, డ్రైన్ల, కల్వర్టుల నిర్మాణానికి అవసరమైన అంచనా ప్రణాళికలను త్వరితగతిన రూపొందించి.. ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page