కేంద్రం సొమ్ముతో జగన్ ప్రభుత్వం సోకులు బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Spread the love

Jagan’s government with central money Sokulu BJP National General Secretary

కేంద్రం సొమ్ముతో … జగన్ ప్రభుత్వం సోకులు :- బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు,ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పోరు సమావేశానికి ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు.మొదటిగా తెలుగు జాతి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు, డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గడచిన 8 ఏళ్లగా బిజెపి కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం వివరించటం తో పాటు రాష్ట్రంలో అధికార , ప్రధాన ప్రతిపక్షం వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు.బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు.ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు బీజేపీ నాయకులు,కార్యకర్తలకు తెలియజేసి ఈ ప్రజాపోరు బాటను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లావేరు మండల బీజేపీ అధ్యక్షుడు ఇజ్జాడ శ్రీనివాసరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలరావు,జిల్లా బిజెపి అధ్యక్షురాలు రెడ్డి పావని, బిజెపి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గున్నారు..

Related Posts

You cannot copy content of this page