వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న

Spread the love

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

సీఎం జగనన్న రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ అభ్యున్నతికి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రగతి రైతు సంఘానికి 40 శాతం సబ్సిడీపై ట్రాక్టర్, రోటో వేటర్ మంజూరయ్యాయి.

జి.కొండూరు మండలంలోని మునగపాడుకు చెందిన రైతు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మండల శేషయ్య గారి కోరిక మేరకు ఈ ట్రాక్టరును శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు స్వయంగా నడిపారు. రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకుని, యంత్రాల సాయంతో సేద్యం చేసి మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page