జగనన్న పేదలకు సురక్ష

Spread the love

జగనన్న సురక్షతో ప్రజలకు చెరువుగ ప్రభుత్వ సేవలు- ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షిత : ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్షకార్యక్రమము, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అందిస్తున్న పౌర సేవలు- తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష
జగనన్న సురక్షతో 11 రకాల సేవలకు ఉచిత సర్టిఫికెట్లు జారీ- కమిషనర్ హరిత ఐఏఎస్
నగర అభివృద్ధికి మా జెండా-ఉప మేయర్ భూమన అభినయ్
నగర పాలక
జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 16,36,2 డివిజన్ పరిధిలోని సరోజినీ దేవి రోడ్డు, ఆర్ సి రోడ్డు, రేణిగుంట రోడ్డు లో జరిగినా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష పేదలకు రక్షగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లక్ష్యంగా ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందించి వారికి సంతృప్తి స్థాయిలో పరిష్కారం లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు పక్కగా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో”జగనన్న సురక్ష క్యాంపులను తీసుకువచ్చింది. ప్రజలందరికీ వందశాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ప్రారంభించింది. అర్హులైన ఏ ఒక్కరు ప్రభుత్వ సంక్షేమం, సేవలు అందలేదని పరిస్థితి ఉండరాదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్షలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు సంబంధించిన సర్టిఫికెట్లు, జననం, మరణం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, కులము, ఆదాయము ఇలా 11 రకాల సర్టిఫికెట్లు అవసరం ఉన్నవారికి ఉచితంగా అందించిన అందుకే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఏదైనా కారణం చేత అర్హత కలిగిన వ్యక్తి పథకం నుండి తప్పించినట్లయితే, అటువంటి సమస్యలను ఈ క్యాంపు లో పరిష్కరించబడతాయని. ప్రజలను సంతృప్తి పరిచే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సహాయపడతాయని తెలియజేశారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమము ద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలు పరిష్కారం లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మీ ఇంటి వద్దకు వచ్చిన ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులు గుర్తించి 11 రకాల సర్టిఫికెట్లు వారి గడప వద్దకే అందించేలా వినూత్న కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలోని అమలు చేస్తున్నామని తెలిపారు.నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమము ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.11రకాల సర్టిఫికెట్స్ అందజేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందించడంలో ప్రభుత్వం సేవ చేస్తుందని తెలియజేశారు. నగర పరిధిలోని లబ్ధిదారులు ఎక్కడికి వెళ్లకుండా, పైసా ఖర్చు లేకుండా అవసరమైన పత్రాలు అందించేందుకు, అర్వత ఉండి ప్రభుత్వ పథకాలు దూరంగా ఉండే వారిని లబ్ధిదారులకు అన్ని అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలియజేశారు.
అనంతరం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుడితి సుబ్రహ్మణ్యం, మోహన్, ఉమా అజయ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ భాషా, తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page