శ్రీవారి సేవకు వేళాయె…..!!

Spread the love

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే లు కేపీ.వివేకానంద , మాధవరం కృష్ణారావు , అరికెపూడి గాంధీ , బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్.భద్రారెడ్డి ….

126 – జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు జరుగుతున్న జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద , మాధవరం కృష్ణారావు , అరికెపూడి గాంధీ , బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి పరిశీలించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు అపురూపమని గత 53 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న జాతరను ఈ యేడు కూడా ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాబు గౌడ్, వెంకటేష్, మనోజ్, గుబ్బల లక్ష్మీనారాయణ, సయ్యద్ సాజిద్, నర్సింగ్, పాపులు గౌడ్, గిరిబాబు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, కమిటీ సభ్యులు పాపిరెడ్డి, రేగురి ప్రవీణ్ కుమార్ గుప్త, సమ్మయ్య యాదవ్, బండ అనిత మహేష్, మహేష్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page