SAKSHITHA NEWS

Indian Women U19 World Cup winner Trisha who participated in the Green India Challenge and planted saplings

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ఇండియన్ ఉమెన్ U19 వరల్డ్ కప్ విన్నర్ త్రిష…


సాక్షిత : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సికింద్రాబాద్ లోని St’John’s Sports Coaching Foundation ఆవరణలో మొక్కలు నాటిన ఇండియన్ ఉమెన్ U19 వరల్డ్ కప్ విన్నర్ త్రిష మరియు Former India Fielding Coach R శ్రీధర్.

ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 17కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్పవిషయమని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.ఎట్టి పరిస్థితుల్లో అయిన మొక్కలను నరకరాదు అని అది చట్ట రిత్య నేరమన్నారు.ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.


అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు వృక్ష వేదం పుస్తకాన్ని త్రిష మరియు వారి కోచ్ కు బహుకరించారు..


SAKSHITHA NEWS