ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు

Spread the love

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు

పల్నాడు జిల్లాలో వరుస దాడులతో వైసీపీ గుండాలు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా?

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

పల్నాడులో వైసీపీ గూండాలు సృష్టిస్తున్న విధ్వంసం పై పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నాయకులతో కలసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో పులివెందుల తరహా హత్య రాజకీయాలతో 2024 ఎన్నికల నాటికి ప్రత్యర్థులు లేకుండా చేయాలని వైసీపీ గుండాలు పధక రచన చేస్తున్నారని విమర్శించారు.ఈ పధక రచనలో భాగంగానే రొంపిచర్ల మండలంలో బలమైన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హత్య చేయించారన్నారు.

కోటప్పకొండ తిరుణాల సందర్భంగా టీడీపీ సానుభూతిపరులు ఏర్పాటు చేసిన ప్రభల దెగ్గర టీడీపీ కార్యకర్తల పై విచక్షణారహితంగా దాడి చేసి పొలిటికల్ టెర్రరిజాన్ని సృష్టించారన్నారు.ఈ పధక రచనలో భాగంగానే మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య,జల్లయ్యలను హతమార్చారని,మాచర్ల టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారన్నారు.నేడు కారంపూడిలో టీడీపీ నేత నాగేశ్వరరావు పై వైసీపీ గూండాలు హత్యాయత్నం చేశారని డా౹౹చదలవాడ తెలిపారు.పోలీసులు వైసీపీ గుండాలకు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ బాధింపబడిన టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు వెన్నా బాలకోటిరెడ్డి మృతదేహాన్ని అప్పగించడంలో జాప్యం చేసి న్యాయం అడిగిన టీడీపీ కార్యకర్తలు,నా పై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు.కార్టన్ సెర్చ్,శాంతి భద్రతల పేరుతో టీడీపీ నాయకుల కార్యక్రమాలను అడ్డగించి అక్రమ కేసులు పెట్టి పోలీసులు వైసీపీ గూండా మేనిఫెస్టోను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కృష్ణా నదిలో తొక్కి బంగాళాఖాతంలో కలిపేస్తారని జోస్యం చెప్పారు.ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వృత్తిని అవమానిస్తున్నారన్నారు.వైసీపీ గూండాలకు కొమ్ముకాస్తున్న పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే పేర్లు రాసి పెట్టుకుంటున్నామని టీడీపీ అధికారంలోకి వచ్చాక నల్లమల అడవులకు సాగనంపుతామని డా౹౹చదలవాడ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు బండారుపల్లి విశ్వేశ్వరరావు,శిఖనం అమర్నాథ్,చల్లగుండ్ల హరికృష్ణ,రెహమాన్,రమేష్,బంగారం తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page