కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం

Spread the love

వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలోని వివేకానందనగర్ రిక్రియేషన్ సెంటర్ ఆవరణలో కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు సంగీత్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు తన సొంత నిధులతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగరావు తో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతు కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు నిర్మించిన ఫంక్షన్ హాల్ ను కాలనీ సభ్యులు ఉపయోగించుకోవాలని, రాజేశ్వర్ రావు ని ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని,ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు అని ,సమాజ హితం ముందుకు రావడం అభినదనియం అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తానని అన్నారు. ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఫంక్షన్ హాల్ ను కాలనీ సంక్షేమం ,అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు. అదేవిధంగా ఫంక్షన్ హాల్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేస్తారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ శ్రీ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, వివేకానంద నగర్ సొసైటీ సభ్యులు,కాలనీ వాసులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page