ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

Spread the love

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

— చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు

చిట్యాల – సాక్షిత ప్రతినిధి

ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల లోని హనుమాన్ రైస్ ఇండస్ట్రీస్, ఉదయ్ రైస్ మిల్, సిద్ధార్థ రైస్ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల డి యం.నాగేశ్వర్ రావు లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధాన్యం దిగుమతులను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని దిగుమతులు చేసుకోవాలని మిల్లర్ లను ఆదేశించారు. వారి వెంట సివిల్ సప్లై ఆర్ఐ లింగస్వామి, రెవిన్యు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page