స్థానిక పార్లమెంట్ సభ్యుడినే విస్మరిస్తారా??

Spread the love


Ignore the local member of parliament??

స్థానిక పార్లమెంట్ సభ్యుడినే విస్మరిస్తారా??


సాక్షిత : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డులో నాగార్జున డ్రీమ్ లాండ్ వద్ద వాటర్ వర్క్స్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకం పైన స్థానిక ఎంపీ,టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేరు లేకపోవడం పట్ల స్థానిక కౌన్సిలర్ శ్రీవిధ్య మరియు కాంగ్రెస్ నాయకులు బైరి ప్రశాంత్ గౌడ్ నిన్న జాయింట్ కలెక్టర్ కి మరియు వాటర్ వర్క్స్ ఎండి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

అదే విషయాన్ని *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * అధ్వర్యంలో నాయకులు బైరి ప్రశాంత్ గౌడ్ మరియు శివకుమార్ గౌడ్ ,మాజీ కొ-ఆప్షన్ సభ్యులు ఇబ్రహిం,శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి ని కలిసి సమస్యను వివరించడం జరిగింది.


కేవలం రాజకీయ కారణాలతోనే రేవంత్ రెడ్డి పేరు లేకుండా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని,ఇదే విషయాన్ని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని,అటువంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి ఇలాంటి అధికారులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Related Posts

You cannot copy content of this page