ప్రకృతి పచ్చగా ఉంటే జీవితం నిండుగా ఉంటది”

Spread the love

If nature is green, life is full”

ప్రకృతి పచ్చగా ఉంటే జీవితం నిండుగా ఉంటది”

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్


సాక్షిత : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త హరిత ప్రేమికుడు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు దానికి బదులుగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హైదరాబాద్ పట్టణంలోని తన నివాసంలో మొక్క నాటి ధన్యవాదాలు తెలియజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్ అని అన్నారు.

మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి, అలాగే మానవ సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు

Related Posts

You cannot copy content of this page