SAKSHITHA NEWS

సుభాష్ నగర్ జె.కె నగర్ ఎస్.ఎస్.కే కమ్యూనిటీ హాల్ నందు130- సుభాష్ నగర్ డివిజన్ కృష్ణమూర్తి నగర్, జెకె నగర్, శ్రీ సాయి వెంకటాద్రి నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద విజయాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం మరియు చేరికల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో అభివృద్దే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం ప్రజలను రెచ్చగొట్టడం, విద్వేషాలను రేకెత్తించడం పనిగాపెట్టుకున్నాయని ఇలాంటి నాయకుల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండి అభివృద్ధి నిరోధకులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పి, ప్రజా అభివృద్ధి కోరుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండే బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీని అందించి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు.

అనంతరం శేఖర్ రెడ్డి మరియు వారి మిత్రబృందం సభ్యులు దాదాపు 50 మంది ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు శ్రీధర్, అరుణ, రాములు యాదవ్, జయరాం నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లేష్, కృష్ణమూర్తి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబయ్య, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.నవీన్, సభ్యులు సిహెచ్ మధు, ఎండి. వాజీర్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 03 At 12.22.00 Pm

SAKSHITHA NEWS