కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం – జిట్టా నగేష్

Spread the love

కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం – జిట్టా నగేష్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కార్మికులకు భారత రాజ్యాంగం ఎన్నో చట్టాలను, హక్కులను కల్పించినప్పటికీ పాలకులు వాటిని అమలు పర్చటంలో పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి,ఆరెగూడెం గ్రామాలలో సోమవారం రాత్రి ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిపిన మేడే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిపిఎం జెండా లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు లడే రాములు,ఐతరాజు నర్సింహ గ్రామశాఖ నాయకులు లడే శ్రీను, పేర్వారం రాములు, ఖలీల్, పొట్లపల్లి చంద్రయ్య, ఏర్పుల చంద్రయ్య, సత్తయ్య, తిమ్మయ్య, నరసింహ, మల్లమ్మ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page