మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరిన కుసుమవారిగూడెం BJP గ్రామ శాఖ అధ్యక్షుడు గోగుల రామకృష్ణ.

Spread the love

సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై సూర్యాపేట 8 వ వార్డు కుసుమవారిగూడెం కు చెందిన BJP గ్రామశాఖ అధ్యక్షుడు గోగుల రామకృష్ణతోపాటు పలువురు BJP నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. శనివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో BRS లో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా BRS చేరినవారిలో గోగుల వెంకన్న, సైదులు, ఉపేందర్, సతీష్, రాము, రవి, వెంకటేశ్వర్లు, రాంబాబు, శ్రీను లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జూలకంటి నాగేందర్ రెడ్డి, 8 వార్డు BRS పార్టీ ఇంచార్జ్ కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి, కొండేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page