విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల గోదావరిఅంజిరెడ్డి సంతాపం

Spread the love

పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి చిన్న వయసులో అందరికీ దూరం కావడం బాధాకరమని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.ఈ కష్టకాలంలో విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page