నవరత్నాల పేరుతో నవ మోసలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం – గాలి భాను ప్రకాష్

Spread the love

తిరుపతి జిల్లా,పుత్తూరు…

నవరత్నాల పేరుతో నవ మోసలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం – గాలి భాను ప్రకాష్…

వైసీపీ ప్రభుత్వంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని,గేటు పుత్తూరు 10 వ వార్డు లో కార్యక్రమాన్ని నిర్వహించారు…

ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న గాలి భానుప్రకాష్…

వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ, పత్రాలను పంపిణీ చేశారు…

విద్యుత్ చార్జీలు, పన్నులు నిత్యవసర సరుకుల ధరల పెంపుపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు…

ఈ సందర్భంగా గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ:

నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం అన్నారు…

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు నిరుద్యోగ యువతకు ప్రతినెల 2000/-రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు…

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పన్నులపై పునఃసమీక్ష చేయడంతో పాటు నిత్యవసరకులకు ధరలకు కళ్లెం వేస్తామని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎన్ ఎన్ ధనపాల్,రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ డి.జి ధనపాల్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page