ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి,

Spread the love

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అప్పట్లో అపాయింటెడ్‌ డేని ప్రకటించలేకపోయామన్న హరీశ్‌రావు.. కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసే తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు గడిచినా విలీనం ఊసే లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే.. విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారన్నారు.

Related Posts

You cannot copy content of this page