నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :
ఖమ్మం నగరంలో మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు, పరామర్శలు తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు.


ఇటివలే వివాహం జరిగిన ఖమ్మం కార్పొరేటర్ చామకురి వెంకన్న కుమార్తె ప్రశాంతి – లక్ష్మణ రావు లను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు.
మమత ఆసుపత్రిలో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఏపూరి కృష్ణారావు ని కలిసి పరామర్శించారు. ఖమ్మం గాంధీ చౌక్ లోని శ్రీ వరప్రదాత షిరిడీ సాయిబాబా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబా ఆశీర్వాదం తీసుకున్నారు.


కార్యక్రమంలో కూరాకుల నాగభూషణం, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్, వేములపల్లి వెంకన్న, కన్నం ప్రసన్న కృష్ణ, శీలంశెట్టి వీరభద్రం, గుత్తా రవి, గౌరోజు వసంత్, బిక్కసాని జస్వంత్, బండారు శ్రీనివాస్, పరమేష్ తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page