రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

రైతులు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మేడి లింగమ్మ నర్సింహ కోరారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లింగమ్మ నర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
కర్నాటి ఉప్పల్ రెడ్డి, ఆవుల నరసింహ మేడి ఉపేందర్ ఏపీవో పద్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు బలిక మాధవి మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page