కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

Spread the love

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సత్రంలో జరిగిన యాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రజా సేవలో కోడెల ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలని, కష్ట కాలంలో అయన ప్రజలకు అండగా ఉన్న తీరు, అభివృద్ధిలో నడిచిన విధానమే.. ఈరోజు కోడెల మన మధ్యన నిలబెట్టాయని, ప్రజా అభిమానాన్ని సాధించిపెట్టాయన్నారు.

ప్రజా నాయకుల విధానాన్ని యువత పనికిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేసే తత్వంతో అడుగులేయ్యాలన్నారు.

Related Posts

You cannot copy content of this page