ప్రతి పల్లె అభివృద్ధితో ముందుకు సాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “

Spread the love

Every village should move forward with development: Vikarabad MLA

ప్రతి పల్లె అభివృద్ధితో ముందుకు సాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత ; వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని బూచన్ పల్లి గ్రామపంచాయతీ జాజిగుబ్బర్ తండా, కొత్లాపూర్ గ్రామపంచాయతీ అల్లాపూర్ మరియు పట్లూరు గ్రామపంచాయతీ పట్లూరు తండా లో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

జాజిగుబ్బర్ తండాలో మరియు పంట పొలాలలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు.


అల్లాపూర్ గ్రామానికి నూతనంగా ఒక ట్రాన్స్ఫార్మర్మంజూరు చేసి, ఏర్పాటు చేయాలన్నారు.
అల్లాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజిలను సరి చేసి గ్రామానికి సరిపడా నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.


జాజిగుబ్బర్ తండా, అల్లాపూర్ మరియు పట్లూర్ తండాలో వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు మరియు రేషన్ బియ్యం ఎక్కడికక్కడ అదే గ్రామంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అల్లాపూర్, జాజిగుబ్బర్ తండా మరియు పట్లూరు తండాల్లో మురుగు కాలువలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.


ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
పాడు బడ్డ ఇళ్ళు మరియు పిచ్చిమొక్కలు తీసేసి, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ… గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అనంతరం బూచన్ పల్లి గ్రామంలో చెందిన ముగ్గురికి కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఒకరికి లబ్ధిదారులకు మంజూరైన Rs,1,76,000/- (రూపాయలు ఒకలక్ష డెబ్భై ఆరువేలు) విలువ గల 4 CMRF చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page