SAKSHITHA NEWS

పోషణ్ పక్వాడ వారోత్సవాలు,ఉగాది సంబరాల్లో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.

  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో రణస్థలం,లావేరు మండలాల ఐసీడీఎస్  ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ వారోత్సవాలు,ఉగాది సంబరాల్లో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంపూర్ణ పోషణ,తెలుగువారి సంప్రదాయాలకు మేళవించే ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలనిఅన్నారు.సంపూర్ణ పోషణ అలవరుచుకోవాలని,సంపూర్ణ పోషణతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉగాది సంబరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, వివిధ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు,షీల్డ్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటలు స్టాల్ ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో రణస్థలం మండల నాయకులు,ఐసీడీఎస్ పిఓ  ఝాన్సీ, ఏసిడిపిఓ సుగుణ,సూపర్వైజర్లు,అంగన్వాడి కార్యకర్తలు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS