నిరుపేద కుటుంబానికి అండగా ద్యాప నిఖిల్ రెడ్డి

Spread the love

Dyapa Nikhil Reddy supports the poor family

నిరుపేద కుటుంబానికి అండగా ద్యాప నిఖిల్ రెడ్డి.

సాక్షిత ప్రతినిధి ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట గ్రామానికి చెందిన వడ్డెర జంగమ్మ(60) నిన్న రాత్రి అనారోగ్యంతోమరణించింది.ఊర్కొండ పేట కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,జననేత, ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు నిఖిలన్న యువసేన పేరిట 5000/- తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ నగదును నిఖిలన్న యువసేన సభ్యులు,కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి షైబాజ్,యువజన కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమని రవి, మరియు మరియు DNR యువసేన సభ్యులు ఖైసర్,ఆమెర్,హబీబ్,మధు,అశోక్,రమేష్,ఇంతియాజ్,షాకిర్,అమ్ము,మాసూమ్,మహబూబ్,ఆరిఫ్ తదితరులుపాల్గొన్నారు.

మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి తక్షణ ఆర్ధికసహాయం అందించారు,ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకులా ఆదుకుంటున్న నిఖిల్ రెడ్డి భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహిచాలని జడ్చర్ల నియోజకవర్గ కార్యదర్శి షైబాజ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page