దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

Spread the love

విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట 93వ రోజు

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.
పవనన్న ప్రజా బాట 93వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన
39 వ వార్డు చిలకపేట పుష్పవతి అయిన అమ్మాయి హేమ కి పట్టు బట్టలు వెండి పట్టీలు అందజేశారు. అలాగే ఆ ప్రాంతంలో పర్యటించి పలువురు దివ్యాంగులను కలుసుకున్నారు.
వారికి కావలసిన స్టాండ్లు త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు. మరి కొద్ది రోజులలో మళ్ళీ ఆ ప్రాంతంలో పర్యటించి దివ్యాంగులకు తప్పకుండా అందజేయునునట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.


వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే వ్యక్తిగత సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అన్ని విధాలుగా జనసేన నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రణీత్, గణేష్, నాగేంద్ర,సోమనాయుడు,జయ, లలిత,పద్మ, కుమారి, దక్షిణ నియోజకవర్గ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page