సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

Dr. Gopireddy Srinivasa Reddy distributed the CM Relief Fund cheques

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సాక్షిత : నరసరావుపేట పట్టణం గుంటూరు రోడ్డు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు వచ్చిన 53 లక్షల 400వేల రూపాయల సీఎం ఆర్ధిక సహాయ నిధి చెక్కులను నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,254 జబ్బులను ఇవాళ ఆరోగ్య పరిధిలోకి తీసుకువచ్చి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది అన్నారు.

కన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అన్నారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కు 15 లక్షలు, చిన్న పిల్లల్లో వచ్చే కాక్ క్లియర్ ఇన్ప్లాంటేషన్ కోసం 12 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు. వైఎస్సార్ పేదల కోసం 1 అడుగు ముందుకు వేస్తే.. జగన్ 2 అడుగులు ముందుకు వేస్తున్నారు అని కొనియాడారు

Related Posts

You cannot copy content of this page