తాగునీటి సమస్య లేకుండా చూడాలి: డిపిఓ సురేష్ మోహన్

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ సురేష్ మోహన్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ తాగునీరు, ఆస్తి పన్ను, నర్సరీ, గ్రీనరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ నెలలో మూడుసార్లు ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేయించాలన్నారు. నీళ్లు నింపిన ప్రతీ సారి క్లోరినేషన్ విధిగా చేసుకోవాల్సిందిగా సూచించారు. పైపైన్ లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్,
డిఎల్ పిఓ, ఎంపిఓ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page