ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగ విత్తనాల పంపిణీ

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం లోని రైతు భరోసా కేంద్రం నందు రైతులకు ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగల (విత్తనాలు) పంపిణీ కార్యక్రమం ను *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు మేలు చేసే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం ద్వారా రైతులకు ఎంతో మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రం ను నిర్మించి, రైతులకు కావాల్సిన ఎరువులను, విత్తనాలను అతి తక్కువ ధరలకే పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ లో భాగంగా నేడు మంచి శనగలను రాయితీ పై అందిస్తున్నారు. 20 కేజి ల బస్తా 1600 కాగా రైతు భరోసా ద్వారా ప్రభుత్వం వారు రైతులకు రాయితీ పై 810 రూపాయల కే ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు…

Whatsapp Image 2023 10 13 At 4.05.53 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page