ఎస్సై శివ కృష్ణ రెడ్డి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ

Spread the love

కే.జీ. ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం

ఎస్సై శివ కృష్ణ రెడ్డి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మంగళవారం రోజు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో కృష్ణపట్నం గ్రామ సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం కే.జీ. ఎస్.ఎస్.ఎస్ అధ్యక్షులు కే భవాని శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముత్తుకూరు ఎస్సై శివకృష్ణారెడ్డి విచ్చేసి పేదలకు మజ్జిగ పంపిణీ చేశారు. మంగళవారం రోజు కే.జీ.ఎస్.ఎస్.ఎస్ అధ్యక్షులు కె భవాని శంకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామని అధ్యక్షులు భవాని శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముత్తుకూరు ఎస్సై శివ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…. గత సంవత్సరంలో కూడా కే జి ఎస్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా యువత ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయటం హర్షనీయమని తెలిపారు. ఇలాంటి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్న యువతని ఎప్పుడు ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే జి ఎస్ ఎస్ ఎస్ సభ్యులు హరిబాబు, నాగార్జున,రాజా వివేక్, సునీల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page