వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

Spread the love

వైసిపి పాలనకు చరమగీతం పాడుదాం.

అడుగడుగునా పూలవర్షంతో ఘన స్వాగతం ,నీరాజనాలు పలికిన మునిమడుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు .

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల మునిమడుగు పంచాయతీ నందు ఎన్నికల శంఖారావ కార్యక్రమం పూరించిన సవితమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ
మునిమడుగు పంచాయతీ అభివృద్ధి జరిగింది టిడిపి హయాంలోనే

మునిమడుగు గ్రామానికి గతంలో కరెంటు లేని అంధకారంలో ఉన్న గ్రామానికి మా తండ్రి ఎస్ రామచంద్ర రెడ్డి ఉన్న సమయంలో ఈ గ్రామానికి విద్యుత్ ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కుతుంది..

పరిటాల రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు మరింత అభివృద్ధి చేశారు

అలాగే ఈ గ్రామానికి ప్రధాన సమస్యగా ఉన్న చెరువుగట్టు తెగిపోవడంతో మన అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి చెరువు కట్ట మరమ్మత్తులు చేయించి శాశ్వత పరిష్కారం చూపించారు.

గత పాలక ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకర్నారాయణ ఈ 5ఏళ్ళు ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదు

ఇదే ఈ గ్రామ టిడిపి నేత చిన్న వెంకటరాముడు సర్పంచ్ గా ఉన్న సమయంలో డ్రైనేజీలో రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మించిన ఘనత టిడిపిది

పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా ఉన్న సమయంలో ఏ అభివృద్ధి నోచుకోలేదు

అధికార పార్టీ వైసీపీ పబ్బం కడుపుకునేదానికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట సచివాలయం నిర్మించి దానిని పెండింగ్ పెట్టించిన ఘనత వైసీపీ అధికార పార్టీ నాయకులకి దక్కుతుంది..

ఈ గ్రామంలో శాశ్వత పరిష్కారంగా గుట్టురు గ్రామం నుండి మునిమడుగు చివరి వరకు రోడ్డు నిర్మాణం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే పనులు వేగవంతం చేస్తామని కావున వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసుకుందామని కోరిన సవితమ్మ గారు .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page