ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం

Spread the love

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు బిజేపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సి.పి.ఎం. ప్రచారభేరి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం వీధుల్లో కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం మనందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను, మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలని,వాడరేవుల్ని, ఆఖరికి మన అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు ధారాధత్తం చేస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page