SAKSHITHA NEWS

124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రోడ్డు మీద నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియచేసారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కాలనీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో నిరంజన్, వాసుదేవరావు, పద్మయ్య, వెంకటేశ్వరరావు, రమేష్, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS