సమస్యలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి తెలుసుకున్నారు

Spread the love

Corporator Ragam Nagender Yadav visited and learned about the problems

శేరిలింగంపల్లి డివిజన్ లోగల రైల్ విహార్ కాలనీ, హుడాట్రేడ్ సెంటర్ లోని రంగప్రసాద్ రెసిడెన్సీలో స్థానిక వాసుల సమస్యలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చిన యుజిడి సమస్యను, మంజీరా వాటర్ సమస్యను, మరియు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌలభ్యం కొరకు రోడ్ వైడింగ్ ను చేపట్టాలని అలాగే పై సమస్యలను త్వరగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాలనీలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రతి సమస్య పరిష్కారం కొరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏరియా మేనేజర్ సుబ్రహ్మణ్యం రాజు, రైల్ విహార్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, రంగప్రసాద్ రెసిడెన్సీ అసోసియేషన్ సభ్యులు మరియు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page