SAKSHITHA NEWS

దేవాలయాల నిర్మాణం చేసి దేవుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో గ్రామాలకు మంచి జరుగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.


సాక్షిత : అమీన్‌పూర్‌ మండలం వడక్‌పల్లి గ్రామంలో శ్రీకోదండసీతారామచంద్ర, ఆంజనేయ మహావిగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ హాజరై మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరినట్లు చెప్పారు. అధ్యాత్మిక వాతావరణం వెల్లివిరయడంతో మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. ప్రజలుకు ఉపయోపడే వ్యక్తిగా ఎదగాలని దీవించారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మన్నే పోచయ్య, శ్రీధర్ గౌడ్,మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి, రవి గౌడ్, వడ్డే రమేష్, దుర్గ రెడ్డి, నందయ్య,ప్రభాకర్,సుధాకర్, మధు,రవి,కుమార్, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS