జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుక

Spread the love

జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

▪️ఉమ్మడి జిన్నారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 138వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కటింగ్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 138 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ లో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. 138 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఎన్నో సేవలందించింది అని తెలిపారు. దేశానికి సేవలందించిన మహా నాయకులను తలచుకున్నారు.


కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మాని అహర్నిశలు కష్టపడ్డారు ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తాం అని తెలిపారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలకు 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు నాయకులు కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లి ఆరు గ్యారెంటీ లపై ప్రతి ఒక్క కుటుంబనికి అవగాహన కల్పిస్తూ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు చేరే విధంగా కష్టపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page