మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరిన దేవరుప్పుల మండలం దారవత్ తండ కి చెందిన కాంగ్రెస్ నాయకులు

Spread the love

గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, మండలం, దారవత్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ అధ్యక్షులు. జగన్, సురేష్, అశోక్,సిద్దు ల అధ్వర్యంలో గౌతమ్, వినోద్, సందీప్, ప్రవీణ్, వెంకన్న, సతీష్, సాయి, సుమన్ , యాకు, శ్రీను, వంశి, యాకన్న,రవి, యకన్న, హరీష్, నవీన్, చందర్,సోమన్న, సాయి రామ్, మంగర్, నిమా, భాస్కర్, నవీన్, రాజు, స్వామి, రమేష్, సోమన్న, స్వామి, తదితరులు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మాట్లాడుతూ…రాష్ట్రంలో సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి ని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తండాలను నూతన గ్రామపంచాయితీలని చేసిన ఘనత సీఎం కెసిఆర్ ది అన్నారు. ఎస్టీలను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నది దేశంలో ఒక్క సీఎం కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారు. ఇదే సందర్భంలో పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ….సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై, అభివృద్ధిలో భాగస్వాములము కావడానికి బి అర్ ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. అలాగే మన పాలకుర్తి ప్రాంతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి ని చూసి రాబోయే ఎన్నికల్లో దయన్న అధిక మెజారిటీ తో గెలిపించే0దుకు తన వంతు బాధ్యతగా పని చేస్తామని మంత్రికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page