రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

Spread the love


Congress government is coming

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాహుల్ గాంధీ జోడో యాత్ర కు దేశ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం


*రోయ్యురు, శంకరాజు పల్లి నుండి 60మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *


సాక్షిత : ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏటూరు నాగారం మండలం శంకరాజు పల్లి,రోయ్యూరు గ్రామానికి చెందిన 60 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ


కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో యువకుల కు మొండి చెయ్యి చూపిన ముఖ్య మంత్రి కెసిఆర్ కి యువకులు బుద్ది చెప్పడం ఖాయమని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జొడో యాత్ర కు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు అని రాబోయే ది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ములుగు ప్రాంత అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా పని చేస్తా అని పార్టీలో చేరిన వారికి శుభా కాంక్షలు తెలుపుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అందరూ సమన్వయము తో కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావాలని సీతక్క అన్నారు


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట మట రఘు,ములుగు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి


ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,జిల్లా సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,మాజీ సహకార సంఘం చైర్మన్ దేవుళ్ళ పల్లి విజయ్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్


యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీను ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు
సర్పంచ్ చెల వినయ్,ఎండీ లాల్ పాషా,చిట్టి బాబు,మధు బాబు,రమేష్ సత్యం,
తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page