సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

Spread the love

CM KCR’s Dussehra gift to Singareni workers

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

లాభాల్లో 30 శాతం వాటాను
ప్రత్యేక ప్రోత్సాహకంగా అందించాలని
సింగరేణి ఎండీకి సీఎం ఆదేశం

సీఎం ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు
రూ. 368 కోట్లు దసరా పండుగ లోపే
చెల్లించనున్న సింగరేణి యాజమాన్యం

సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు … సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

Related Posts

You cannot copy content of this page