రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

Spread the love

రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సాక్షిత :

చింతకాని మండలం నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రాష్ట్రాల కబడ్డీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు…ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగింస్తూ యువజన సంఘం వారు ప్రతి ఏడాది ఈ క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయం, చాలా వ్యయం తో కూడుకున్న పనే అయినా చాలా ఏళ్లుగా క్రీడలు నిర్వహిస్తున్నారు,మీరు అడిగిన క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తా అని అన్నారు….

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, సినియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య , నేరడ గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చ ఈశ్వరమ్మ, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దూసరి శ్రీరాములు, అధ్యక్షులు నేతాజీ, గ్రామ ఉపసర్పంచ్ దూసరి గోపాలరావు, కాంగ్రెస్ నాయకులు మంకెన నాగేశ్వరరావు, షేక్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు ..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page