నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు

Spread the love

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు
**సాక్షిత తిరుపతి : చవితి నిమజ్జనానికి సహకరించండి కమిటీ సభ్యులు
*చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేపడుతాం మేయర్ డాక్టర్ శిరీష

వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా వరసిద్ధ వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వారిని నగర పాలక సంస్థ కార్యాలయంలో వారి ఛాంబర్ నందు మంగళవారం కలిసి చవితి నిమజ్జనానికి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.
సభ్యులు వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా సాగర్ మధ్యలో భారీ సుమారు 60 అడుగుల నాట్య గణపతి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రజల యొక్క చిరకాలక వాంచ కావున విగ్రహా ఏర్పాట్లకు అవసరమైన సూచనలు చెయ్యగలరని కోరుచున్నాం.
నగర పరిధిలో సుమారు వెయ్యకు పైగా మండపాలు ఏర్పాటు చేసి పూజధికాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని. వినాయక సాగర్ వద్ద నిమజ్జం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయుటకు తమ సహాయ సహకారాలు అందించాలని కమిటీ సభ్యులు కోరారు.

మేయర్ డాక్టర్ శిరీష వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ వినాయక చవితి నిమజ్జనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నగర ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకి తెలిపారు.మేయర్ శిరీష వారిని కలిసిన వారిలో కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, మాగంటి గోపాల్ రెడ్డి, ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్, వెంకటేష్, ఆనంద్, కోట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page