రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శంబిపూర్ కార్యాలయంలో పంపిణీ చేశారు.

అదే విధంగా ఐదుగురు పేదలు వైద్యం చేయించుకునేందుకు రూ.7 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ ఓ సీ లను మంజూరు చేయించి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సహాయం అందజేస్తుందన్నారు. అర్హులైన ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page