డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని డి.పోచంపల్లి 7వార్డులోనీ మల్లన్న స్వామి ఆలయ అవరణలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ ముడిమెల రాము గౌడ్ తో కలిసి ప్రారంభించిన దుందిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు.

అనంతరం మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, మహేందర్ యాదవ్, రమా దేవి, సాయి యాదవ్, అనంత స్వామి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కోల్తుర్ మల్లేష్, బిసి శాఖ అధ్యక్షులు రాజా శేఖర్ యాదవ్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, నాయకులు ఆనబోయిన సత్యనారాయణ, కొల వెరేశ్, సదానందం, యాదగిరి, బాల కృష్ణ, శ్రీధర్, రాజు, మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page