ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం

Spread the love

ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం

సాక్షిత బాన్సువాడ :
ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు సూచించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో పర్యటించారు

కురుమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఆయన.. దారిలో రేకుల షెడ్డు, దానిపై పాలిథీన్‌ కవర్‌ కప్పిన ఇంటిని చూసి చలించిపోయారు. రేకుల షెడ్డు ముందు తన బగ్గీ వాహనాన్ని ఆపి ఇంట్లో ఉన్న మహిళతో మాట్లాడారు. గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలని మహిళకు సూచించారు. గ్రామ సర్పంచ్‌ను పిలిచి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేలా సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహిళ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Related Posts

You cannot copy content of this page